స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి.. జగన్ పిలుపు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టే లక్ష్యంతో పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బుధవారం తాడేపల్లిలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కేవలం విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
2040 నాటికి తిరుమల ఎలా ఉండబోతోంది? వీడియో వైరల్ (video)
2040 నాటికి తిరుమల ఎలా ఉండబోతోందోననే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భవిష్యత్తు తిరుమల రూపురేఖలను కళ్లకు కట్టేలా వున్న ఏఐ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలిపిరి మెట్ల మార్గం నుండి టోల్ గేట్ వరకు భవిష్యత్ దృశ్యాలను ఈ వీడియో చూపిస్తోంది.
భవిష్యత్తులో తిరుమలలో రోడ్డు నిర్వహణ ఎలా ఉండవచ్చో తెలిపే దృశ్యాలు ఈ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీ నియంత్రణ, ఏఐ సాంకేతికత వినియోగాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిచెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
కాలేజీ ప్రిన్సిపాల్ను విద్యార్థులే చంపేశారా? పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు?
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.రూపారెడ్డి ఈ నెల 11వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను కాలేజీ విద్యార్థులే చంపేశారన్న అనుమానంతో పలువురు విద్యార్థుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి
యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా పేరు 'నయ్యి నవెల్లి'. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 16 అక్టోబర్ 2026న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
కాలేజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్... యేడాది పాటు ఉచితంగా ఏఐ సబ్స్క్రిప్షన్ (Video)
కాలేజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్. యేడాది పాటు ఉచితంగా గూగుల్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ను ఇవ్వనుంది. గూగుల్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ను యేడాదిపాటు ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. గూగుల్ ఏఐ అసిస్టెంట్, సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























