వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు(ఏపీ పీసీసీ చీఫ్) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యం పాలయ్యారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతర ఆమె వేగంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ, త్వరగా కోలుకోవాలని కాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మద్దతు తనకు కొండంత అండగా నిలిచాయని షర్మిల తెలిపారు.
వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం ధరను సవరించాలని యోచిస్తున్నారు. ఈ ధరల సవరణకు ఆమోదం కోరుతూ ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గత పదేళ్లుగా ధరలను పెంచకుండా, ముడి సరుకుల వ్యయం పెరిగినప్పటికీ నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందిస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం
గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం
ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం
లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం
కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
ఉంగరం కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకున్న తల్లీకొడుకు
బంగారు ఉంగరం కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన తల్లీకొడుకులు అనంతలోకాలకు చేరుకున్నారు. ద్విచక్రవాహనంపై చీమకుర్తికి వచ్చారు. పని పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఇంతలో ద్విచక్ర వాహనం, లారీ వారి పాలిట మృత్యువుగా మారాయి. పోలీసుల వివరాల మేరకు..
Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు
కథానాయుడు సూర్య నటిస్తున్న చిత్రం విశ్వనాథ్ & సన్స్. మమితా బైజు సరసన నటిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి వెండ్డింగ్ సాంగ్ కొద్ది సేపటికిత్రమే చిత్ర యూనిట్ విడుదల చేసింది. తనకుటుంబంలో పెండ్లి జరుగుతుండగా వధూవరుల్ని ఆశీర్వదిస్తూ, ఎడ్యుకేట్ చేసే విధంగా సాహిత్యం వుంది. సూర్య పాట పాడడం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ZENO 100 Pro స్మార్ట్ఫోన్, ZENO పవర్బ్యాంక్లు మార్కెట్లోకి
ZENO సంస్థ తన కొత్త ZENO 100 Pro స్మార్ట్ఫోన్తో పాటు ZENO పవర్బ్యాంక్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ZENO 100 Pro తన విభాగంలో అత్యంత అందుబాటు ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఈ స్మార్ట్ఫోన్కు Military Grade Certification (MIL-STD-810H) లభించింది. దీంతో ఇది మరింత బలంగా, మన్నికగా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న UltraLink టెక్నాలజీ వల్ల నెట్వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ కొనసాగించడానికి సహాయపడుతుంది.
ఈ ఫోన్ 3+5GB RAM, 64GB స్టోరేజ్తో అందుబాటులో ఉంది. అలాగే ఇటీవల విడుదలైన ZENO Lite మోడల్ కూడా 2GB RAM, 64GB స్టోరేజ్తో లభిస్తోంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?
























