తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడనం విస్తరించిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహ దృక్పథంతో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాల జాగ్రత్త. యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండియూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము.
ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి
ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి.
ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్ను వేగంగా బయటకు పంపుతాయి
ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది
అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి.
తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
తాత బైకుపై వెళుతున్న బాలిక ... కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కామాంధుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తాతతో కలిసి బైకుపై వెళుతున్న ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఓ కామాంధుడు ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు తక్షణం స్పందించిన యూపీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మళ్లీ కలిసి జీవించనున్న విజయ్ - సంగీత..? త్రిష పరిస్థితి ఏంటి?
తమిళనాడు సీఎం విజయ్ - సంగీత విడాకుల కేసు సోమవారం విడాకులకు రానున్న తరుణంలో... కోలీవుడ్లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు దూరంగా వున్న భార్య సంగీతతో విజయ్ మళ్లీ కలిసి జీవించనున్నారని తెలుస్తోంది. ఇందుకు జరిగిన చర్చలు కూడా సఫలమైనట్లు టాక్ వస్తోంది.
చాలాకాలంగా దూరంగా వుంటున్న విజయ్- సంగీత తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మనస్పర్థలు తొలగిపోయి, మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ జంటను తిరిగి ఒకటి చేయడానికి విజయ్ కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు సమాచారం.
WIPO తాజా పేటెంట్ల ర్యాంకింగ్స్లో ప్రపంచ టాప్-20లోకి దూసుకెళ్లిన జియో ప్లాట్ఫార్మ్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్ఫార్మ్స్(JPL), ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO) ఇటీవల విడుదల చేసిన తాజా పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) ర్యాంకింగ్స్లో ప్రపంచ టాప్-20లోకి ప్రవేశించింది. ప్రచురిత డేటా ఆధారంగా అగ్ర PCT దరఖాస్తుదారులను ఈ నివేదిక ర్యాంక్ చేస్తుంది.
2025 సంవత్సరానికి సంబంధించిన జాబితాలో JPL ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో హువావే, శాంసంగ్, క్వాల్కమ్, ఎల్జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల సరసన స్థానం సంపాదించింది.
పవన్ కల్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?


























