"ది గర్ల్ఫ్రెండ్" చిత్రంలో తన హృద్యమైన నటనకు గాను రష్మిక 'ఉత్తమ నటి' గా గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆమె ఆ అవార్డుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలలో ఒకదానిలో, ఆమె అత్తగారు ఆ అవార్డును గర్వంగా పట్టుకుని ఉండగా, రష్మిక ఆమె పక్కనే కూర్చుని, సిగ్గుతో తల దించుకుని కనిపించారు.
ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశే ఉగాది పండుగను పురస్కరించుకుని తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పూజగదిలో కనిపించిన ఓ బొమ్మపై కొందరు నెటిజన్లు క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేయడంతో లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగి ఆ వాదనలను ఖండిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.