సీనియర్ నటుడు డా.రాజశేఖర్ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కరించింది. డా.రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ "బైకర్" సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్రావు, సెక్రటరీ సురేష్కొండేటి తదితరులు బొకేను అందజేశారు. అనంతరం క్రిటిక్స్ ట్రెజరర్ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు చదివి వినిపించి, ఆయనకు అందజేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా నారా లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ కొత్త కమిటీలను ఖరారు చేశారు.